- Advertisement -
అబుదాబి: ఐపిఎల్-13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పంజాబ్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్గేల్ 99 ( 63 బంతుల్లో 6ఫోర్లు, 8సిక్సర్లు) రన్స్ తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(46: 41 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించగా, నికోలస్ పూరన్(22: 10 బంతుల్లో 3సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో బెన్స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
- Advertisement -