Wednesday, May 8, 2024

కరోనా బాధితులకు సాయం

- Advertisement -
- Advertisement -

Rakul Preet Singh tests positive for Covid-19

ప్రస్తుతం దేశంలో కరోనా బారినపడి అవస్థలు పడుతున్న బాధితులకు సహాయం చేయడానికి సెలబ్రిటీలు తమవంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బాధితులకు తన వంతు సాయం అందించాలని ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం ప్రారంభించింది. ఇప్పటికే సేకరించిన నిధులతో బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, వాటి రీఫిల్లింగ్ కోసం సరిపడా నిధులను సమకూరుస్తున్నట్లు రకుల్ తెలిపింది. కరోనా నుండి ప్రాణాలను రక్షించే పరికరాలను అందించడానికి కూడా ఆమె తన టీమ్‌తో కలిసి కృషి చేస్తోంది. తాజాగా రకుల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మన దేశ పరిస్థితి చూస్తే బాధగా ఉంది. హాస్పిటల్స్‌లో బెడ్స్, ఆక్సిజన్ లేకపోవడం, మందుల కొరత కారణంగా కరోనా పేషెంట్లు ఎన్నో బాధలు పడుతున్నారు. అయితే ‘గివ్ ఇండియా’ పేరుతో ఫండ్ రైజింగ్ చేస్తూ.. బాధితులకు ఆక్సిజన్ లైఫ్ సేవింగ్ పరికరాలు అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం” అని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News