హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చి 27న తన 35వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మార్చి 26న నగరంలోని రవీంద్ర భారతిలో చాలా గ్రాండ్ గా చరణ్ పుట్టినరోజు ఈవెంట్ ను నిర్వహించాలని అభిమానులు భావించారు. అయితే, హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని అభిమానులకు షాక్ ఇచ్చాడు. గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వ్యాపించే అవకాశం ఉందని, అలాంటి వేడుకలను జరపవద్దని రామ్ చరణ్ తన అభిమానులను ట్వీట్టర్ ద్వారా కోరాడు. ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను జరపకపోవడమే తనకు మీరిచ్చే పెద్ద బహుమతి అని చరణ్ పేర్కొన్నాడు. కరోనాని ఆరికట్టేందుకు అభిమానులందరూ ప్రభుత్వానికి సహకరించాలని చరణ్ పేర్కొన్నాడు.
Megapower Star Ram Charan requests his fans to avoid public gatherings and cancellation of his birthday celebrations. He requests his fans to spread awareness about ways to avoid spread of #Covid19 Virus. pic.twitter.com/KpeIh6pdhT
— BA Raju's Team (@baraju_SuperHit) March 18, 2020
Ram Charan to cancel his birthday celebrations