బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సోమవారం నటుడు రానా ఇడి విచారణకు హాజరుకానున్నారు. నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్లు, టీవీ హోస్ట్లతో సహా 29 మందిపై అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించినందుకు ఇడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు జంగ్లీ రమ్మీ, ఎ23, జీట్విన్, పారిమ్యాచ్, టోటస్365 వంటి ప్లాట్ ఫామ్లకు చెల్లించిన ప్రమోషన్లపై నమోదైంది. 1867 పబ్లిక్ జూదం చట్టం కింద పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేటలతో పాటు ఆంద్రప్రదేశ్లోని విశాఖపట్నంలలో ఐదు వేరువేరు ఎఫ్ఐఆర్ను నమోయ్యాయి. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఇడి అధికారులు దృష్టి సారించారు.
ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్షర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్) నమోదు చేసింది. ఇందులో బాగంగా కేసులో ఉన్న నిందితులను వరుసగా ఇడి విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండలను విచారించగా, సోమవారం దగ్గుబాటి రానా విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ రానాకు ఇడి అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా, ఇదే కేసులో 13వ తేదీన నటి మంచు లక్ష్మివిచారణకు హాజరు కానున్నారు.