దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ విషయంలో హైడ్రా సాయం చేయాలని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు. దేవాదాయ శాఖ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పరిక్షించేందుకు ఇప్పటికే డీజీపీఎస్ సర్వే చేపడుతున్నట్టు చెప్పారు. మంత్రి కొండా సురేఖతో గురువారం సచివాయలంలోని మంత్రి చాంబర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ బతుకమ్మ కుంట పునరుద్ఘరణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మంత్రి అభినందించారు. బతుకమ్మ కుంట పునరుద్దరణ విజయంతంగా పూర్తి చేసినందుకు శభాష్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే, తన పరిధిలో ఉన్న దేవాదాయ శాఖలోని భూముల పరిరక్షణకు హైడ్రా సాయం అవసరమని మంత్రి గుర్తు చేయగా
ముఖ్యమంత్రి అనుమతితో చర్యలు తీసుకుంటామని రంగనాథ్ వివరణ ఇచ్చారు. అందుకోసం ప్రభుత్వ పరంగా శాఖ పరంగా కావాల్సిన సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. హైడ్రా వచ్చాక చేపట్టిన పనుల వివరాలను రంగనాథ్ మంత్రికి సమగ్రంగా వివరించారు. అయితే, మంచి పనులు చేసే సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయని అన్నారు. కానీ సామూహిక ప్రయోజనంలో భాగంగా చేశారని మంత్రి సురేఖ కొనియాడారు. హైడ్రా చేస్తున్న పనులు రానున్న కాలంలో అందరికీ తెలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ వరంగల్ నాలాల ఆక్రమణలను కూడా రంగనాథ్తో చర్చించారు. వాటిని పరిష్కరించేందుకు తమకు సహకరించాలని కోరారు. అందుకు ఆయన సుముఖత తెలిపారు. కాగా, బతుకమ్మ కుంట వేడకులకు మంత్రి సురేఖను రంగనాథ్ ఈ సందర్భంగా ఆహ్వానించారు.