- Advertisement -
బెంగళూరు: నమ్మించి స్నేహితుడు భార్యపై అత్యాచారం చేసి వీడియోలు తీసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంఘటన కర్నాటకలోని మత్తికెరిశెట్టిలో జరిగింది. పోలీసులుత తెలిపిన వివరాల ప్రకారం… ఓ గ్రామానికి చెందిన సంతోష్ కుమార్కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నమ్మించి స్నేహితుడి భార్యను సావనదుర్గకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరువాత అత్యాచారం చేశాడు. వీడియోలు తీసి బాధితురాలుకు ఫోన్ చేసి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తన ఒంటిపై ఉన్న నగలను ఇచ్చేసింది. కుటుంబ సభ్యులు నగల గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆమె భర్త స్థానిక ఎస్పికి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -