జైపూర్: మాయ మాటలు చెప్పి ఓ పంతులమ్మను లైంగికంగా లొంగదీసుకోవడమే కాకుండా నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.15 లక్షల రూపాయలు తీసుకొని ఆమెను వేధించిన సంఘటన రాజస్థాన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బన్స్వారా గ్రామంలో భర్త చనిపోవడంతో ఓ పంతులమ్మ ఒంటరిగా ఉంటుంది. సామాజికలో మాధ్యమాల్లో ముస్తఫా షేక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రతీరోజు పంతులమ్మ, ముస్తాఫా ఛాటింగ్ చేసుకునేవారు. ఛాటింగ్తో మొదలైన వాళ్ల స్నేహం అప్పుడప్పుడు కలుసుకునేవారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కుటుంబం గడవడం కష్టంగా ఉందని పలుమార్లు పంతులమ్మ వద్ద ముస్తాఫా అప్పు తీసుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటికి రమ్మని పంతులమ్మకు ముస్తఫా సమాచారం ఇచ్చాడు. ఇంటికి వచ్చిన పంతులమ్మకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె మత్తులోకి వెళ్లిన తరువాత ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోలు తీశాడు. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు. అతడి ఆగడాలు రోజు రోజుకు శృతి మించడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
సోషల్ మీడియాలో పరిచయం.. పంతులమ్మపై అత్యాచారం…
- Advertisement -
- Advertisement -
- Advertisement -