Tuesday, April 30, 2024

ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రికి శుభాకాంక్షలు: మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన లింబాద్రి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి నూతనంగా నియామకమైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆశయాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ ప్రతిష్టతకు కృషి చేయాలని లింబాద్రికి మంత్రి వేముల సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News