Sunday, April 28, 2024

తెలంగాణ విముక్తి కోసం రావి పోరాటాలు నిర్మించారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. రావి నారాయణ రెడ్డి తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించారని, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి గొప్పదని కొనియాడారు. రావి అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అనుసరించిన పార్లమెంటరీ పోరాట పంథాలో ఇమిడి వున్నదన్నారు. స్వాతంత్య్రం వచ్చినంక దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాది రావి అని ప్రశంసించారు. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి రావి చరిత్ర సృష్టించారన్నారు. ప్రజా పోరాటాలు విజయవంతం కావాలంటే నిర్దిష్ట పరిస్థితులకు, నిర్దిష్ట కార్యాచరణను అనుసరించాలనే సూత్రాన్ని నారాయణ రెడ్డి ఆచరించి చూపారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News