Monday, May 6, 2024

ప్రపంచ పర్యావరణ దినోత్సవం… మొక్కలు నాటిన సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

MP Santhosh kumar plant tree in gajwel

గజ్వేల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంఎల్ఎ, ఎంఎల్ సిలతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ కళాశాల, పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ రావు, శంబీపూర్ రాజు తదితరులతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాట్లాడారు. రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అందుకోసమే తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి, దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణం పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కృషి చేస్తుంది అని అన్నారు.

ఎమ్మెల్యే కెపి వివేకానందా గౌడ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడాలని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి యావత్ భారతదేశం మొత్తం పచ్చదనాన్ని పెంపొందించడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు అని,  వారు చేసిన కృషికి మీము అభినందిస్తున్నానని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రజాప్రతినిధులకు అధికారులకు అప్పజెప్పడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఫారెస్ట్ కళాశాల ,పరిశోధనా సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిలో అడవుల ప్రాముఖ్యత అడవుల వల్ల కలిగే లాభాల గురించి భవిష్యత్ తెలంగాణ విద్యార్థులకు వివరించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న వివిధ రకాల మొక్కలు వాటి నుండి ఉత్పత్తి అయిన ఔషధాలు, జరుగుతున్న పరిశోధనలు ఆసక్తిగా తిలకించడం జరిగింది ఇదే సందర్భంగా తన జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంఎల్సీ నవీన్ రావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News