చెన్నై : అద్దె విషయంలో కిరాయిదారుడికి, యజమానికి మధ్య గొడవ జరగడంతో కిరాయిదారుడు కత్తితో దాడి చేయడంతో యజమాని కోడలు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని చూలియమేడు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాధాక్రిష్ణన్ నగరంలో చంద్రమోహన్ (69) అనే వ్యక్తి తన కుమారుడు సతీష్(35), కోడలు సుకన్య(28) కలిసి నివసిస్తున్నాడు. చంద్రమోహన్ తన కుటుంబంతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ ఫస్ట్ ఫ్లోర్ ఒక రూమ్ను నారాయణ(55) అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. నారాయణ పెయింటింగ్ పను చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో అతడు పనికి వెళ్లకపోవడంతో అద్దె చెల్లించలేదు. అద్దె చెల్లించామని నారాయణను చంద్రమోహన్ అడగడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. కుమారుడు సతీష్, కోడలు సుకన్య వచ్చి నారాయణతో గొడవకు దిగడంతో నారాయణ ఇంట్లో కత్తి తీసుకొని వచ్చి ముగ్గురిపై దాడి చేశాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుకన్య ఛాతీ భాగంతో కత్తి దిగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తండ్రి, కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న నారాయణను పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు.
అద్దె అడిగినందుకు… ప్రాణం తీసిన కిరాయిదారుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -