Friday, May 3, 2024

మరిన్ని గురుకుల పాఠశాలలు స్థాపిస్తాం: తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురుపూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల పాఠశాలలను పెంచాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ ముందుకుసాగుతున్నారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కనివిని ఎరుగని రీతిలో ప్రభుత్వ టీచర్లకు జీతాలు పెంచిందని టిఆర్ఎస్ ప్రభుత్వమని తెలియజేశారు. స్కూల్స్ రూపురేఖలు మార్చేందుకు సిఎం కెసిఆర్ అదనంగా నిధులు మంజూరు చేశారని, మంచి మౌళిక సదుపాయాలు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. విద్య, వైద్యానికి ఈ ప్రభుత్వం మరింత పెద్ద పీట వేస్తోందని తలసాని తెలిపారు. చదువుతో పాటు సంస్కృతిక, స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని టీచర్లను విజ్ఞప్తి చేశారు. రవీంద్రభారతి లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో మంత్రుల సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News