- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు అమలులో ఉన్నాయని వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆంక్షలు ఉన్నా ఎబివిపి, పిడిఎస్యూ కార్యకర్తలు అసెంబ్లీ గేట్ వరకు వచ్చి శాసన సభావ్యవహారాలను ఆటంకాలు సృష్టించేందుకు యత్నించారని తెలిపారు. మంచి వాతావరణంలో ప్రజాస్వామ్యం నడుస్తోందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో అసెంబ్లీ పరిసరాల్లో ధర్నాలు, సమ్మెలకు అనుమతించమని స్పష్టం చేశారు. వ్యక్తులైనా, వివిధ గ్రూపులకు చెందిన వారైన ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Restrictions at surroundings of Telangana Assembly: CP
- Advertisement -