Sunday, April 28, 2024

రేపు కోడంగల్‌లో, 8న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్‌లు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి కోడంగల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో కూడా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసిసి రెండుచోట్ల నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. గతంలో కాంగ్రెస్‌పార్టీ తరపున కామారెడ్డిలో ప్రాతినిధ్యం వహించిన షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్భన్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావు ఠాక్రే శనివారం గాంధీభవన్‌లో నిజామాబాద్ జిల్లా కాం గ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఈ నెల 6న కొడంగల్‌లో నామినేషన్ వేస్తారు. అనంతరం 8వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ వేయడంతో పాటు అదేరోజు బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News