Sunday, May 19, 2024

రైస్ మిల్లింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి : ఖరీఫ్, రబీ సీజన్ పంటలకు సంబంధించిన కస్టమ్ రైస్ మిల్లింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలేరు లోని మల్లిఖార్జున పారాబాయిల్డ్ రైస్ మిల్, రాయగిరి లోని శి వా పారాబాయిల్ రైస్ మిల్లులలో సి.ఎం.ఆర్. పనులను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైస్ బిన్నీ మిల్ యజమానులు పనులలో జాప్యం చేస్తే ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అమె వెంట సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు గోపీకృష్ణ, జిల్లా సరఫరాల అధికారి శ్రీనివాస రెడ్డి, మిల్లర్లు యజమానులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News