- Advertisement -
లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ.85, ముంబైలో రూ.91.56
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 85 వరకు పెరగ్గా, ముంబైలో డీజిల్ ధరలు లీటరుకు రూ.82 వంతున పెరిగాయి. సోమవారం ఇంధనం ధరలు లీటరుకు 25 పైసల వంతున పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ.84.95 వంతున పెరగ్గా, డీజిల్ ధర లీటరుకు రూ.75.13 వంతున పెరిగింది. ఈనెల 13,14 తేదీల్లో లీటరుకు రూ.50 పైసల వంతున రెండు విడతల్లో ధరలు పెరిగాయి. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ.91.56 వరకు పెరగ్గా, డీజిల్ లీటరు రూ.81.87 వంతున పెరిగాయి.
- Advertisement -