Tuesday, April 30, 2024

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం: ఉపాధ్యాయురాలు మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ లోని పద్మనగర్ బైపాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట మోడల్ స్కూల్లో గణిత ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న బండ రజిత మృతి చెందారు. ఉదయం స్కూల్ కి వెళ్తుండగా బైపాస్ రోడ్డు వద్ద ఆమె ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఈమె భర్త బైరెడ్డి తిరుపతిరెడ్డి 8 సంవత్సరాల క్రితమే గుండెపోటుతో మరణించారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద కుమారుడు ప్రజ్ఞ 10 తరగతి, చిన్న కుమారుడు రిశిక్, ఆరో తరగతి చదువుతున్నారు. రజిత మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News