హైదరాబాద్: లాక్డౌన్లో సమయంలో పులువురు సినీ తారలు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తను ప్రేమించిన అమ్మాయిన పెళ్లి చేసుకోగా, స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజు కూడా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు రానా దగ్గుబాటి, నితిన్ లు ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ‘సాహో’ డైరెక్టర్ సుజీత్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎంతో కాలంగా ప్రేమించిన ప్రవల్లికను సుజిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్ధం కుటుంబ సభ్యుల మధ్య గోల్కొండ రిసార్ట్స్లో జరిగింది. వీరి పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక, ప్రవల్లిక వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా పనిచేస్తుందని సమాచారం. కాగా, ప్రస్తుతం సుజీత్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ‘లూసిఫర్’ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు.
Saaho director Sujeeth gets engagement