Sunday, May 12, 2024

ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలి: సత్యవతి

- Advertisement -
- Advertisement -

Teacher jobs allotted tribals

హైదరాబాద్: జివొ నెంబర్ 3పై సుప్రీంకోర్టులో త్వరలో రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం టీచర్ ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా పోరాడుతామని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ తరపున సుప్రీం కోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని పేర్కొన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా సుప్రీం తీర్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశంపై రివ్యూ పిటిషన్ వేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారని సత్యవత్తి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News