Sunday, May 5, 2024

మందుతాగి వాహనాలు నడిపే వారు టెర్రరిస్టులతో సమానం

- Advertisement -
- Advertisement -

Sajjanar Said Everyone Should Abide by Traffic Rules

హైదరాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల చాలామంది అమాయకులు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్నారని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 304 పార్ట్2కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, వేరే వారి సంతోషాన్ని చెడగొట్టవద్దని కోరారు. పోలీసులు ఉన్నా లేకున్నా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.

2021లో ప్రజలు భద్రంగా, ఆరోగ్యంగా ఉండాలి

కొత్త ఏడాదిలో అందరూ సంతోషంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్. కరోనా వ్యాపిస్తుండడం వల్ల ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని, ఒక చోట గుంపులుగా చేరవద్దని కోరారు. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలని అన్నారు. ప్రతి ఏడాది సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద చేసే కేక్ కట్టింగ్‌ను ఈ ఏడాది రద్దు చేసినట్లు తెలిపారు. కరోనా వల్ల వేడుకలను రద్దు చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News