Sunday, April 28, 2024

పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి.. విధుల్లో చేరండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీతో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత వరకూ త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, సమ్మె విరమించి విధుల్లో చేరాలని పారిశుద్ధ కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని కోరారు. క్వాలిఫైడ్ కార్మికులను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు, దాన్ని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News