Sunday, April 28, 2024

‘సర్కారువారి పాట’ నుంచి ఫస్ట్ నోటీస్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న సర్ ప్రైజ్ వచ్చేసింది. పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ నుంచి ఫస్ట్ నోటీస్ పేరుతో మహేష్ లుక్ ను అభిమానులతో పంచుకుంది చిత్రయూనిట్. ఇందులో పొడువాటి జట్టుతో స్టైలీష్ లుక్ లో మహేష్ కారు నుంచి దిగుతున్న పోస్టర్ అదిరింది. అభిమానులను బాగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో మహేష్ సరసన మహానటి ఫేం కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో చిత్రయూనిట్ పేర్కొంది.

Sarkaru Vaari Paata first notice released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News