Tuesday, May 7, 2024

సందేశంతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

Sarkaru Vaaru Paata make mass entertainment

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ను ప్రకటించాడు మహేష్. తన కెరీర్‌లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్,  జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సందేశాత్మక అంశాలతో పూర్తి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ పై అటు మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే మోషన్ పోస్టర్‌లో మహేష్ చెవికి రింగు, రఫ్‌గా కనిపించేలా గడ్డం, మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీ లుక్‌లో అదరగొట్టాడు.

దీంతో మహేష్ ఈ సినిమాలో డిఫెరెంట్‌గా కనిపిస్తాడని అర్థమవుతోంది. అయితే అతని కెరీర్‌లో అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్స్‌లో కనిపించిన చిత్రాలు చాలా తక్కువ. అందులోనూ ‘శ్రీమంతుడు’ నుంచి మహేష్ పక్కా మాస్ సినిమా చేయలేదు. అందువల్ల ‘సర్కారు వారి పాట’ సినిమాని సందేశాత్మక అంశాలను జత చేస్తూనే పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలని డైరెక్టర్ పరశురామ్‌కు మహేష్ సూచించాడట. దీనికి తగ్గట్టుగా పరశురామ్ ఈ చిత్రం స్టోరీ, స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దుతున్నాడని తెలిసింది.

Sarkaru Vaaru Paata make mass entertainment

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News