Sunday, April 28, 2024

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి సత్యవతి రాథోడ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మొక్కలు నాటారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరుతూ ఎంపి సంతోష్ ట్వీట్ చేశారు.

ఎంపి సంతోష్ కుమార్ పిలుపుమేరకు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి మొక్క, మామిడి మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.

Satyavathi Rathod sapling plants at her house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News