Wednesday, May 8, 2024

మా నమ్మకం నిజమైంది

- Advertisement -
- Advertisement -

కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది ‘వరుడు కావలెను’ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమా అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సినిమాకు మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ “వరుడు కావలెను సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మొదటి నుంచీ బలంగా నమ్మాను. ఇవాళ మా నమ్మకం నిజమైంది. థియేటర్లకు వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా బాగా నచ్చింది. సినిమా బాగుంది అనే టాక్ పెరుగుతోంది. ‘వరుడు కావలెను’ చిత్రంతో ప్రేక్షకులకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది”అని అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…“ఒక క్లీన్ మూవీ చేశాం. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఒక కొత్త డైరక్టర్‌ని తీసుకొచ్చి మా సంస్థకు హిట్ ఇచ్చినందుకు హీరో నాగశౌర్యకు థాంక్స్ చెబుతున్నా”అని తెలిపారు. దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ…“మా మూవీ టీమ్ అంతా ఒక మహిళైన నన్ను నమ్మి సపోర్ట్ చేసి సినిమా చేయించారు. అక్కా అని పిలిచే నాగశౌర్య నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మేము కథలో అనుకున్న భావోద్వేగాలు స్క్రీన్ మీద పండాయి. సకుటుంబంగా థియేటర్లకు వస్తూ మా చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత గణేష్ రావూరి, గీత రచయిత గోసాల రాంబాబు, కొరియోగ్రాఫర్ విజయ్, నటులు అర్జున్, హిమజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Varudu Kavalenu movie success meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News