- Advertisement -
వరంగల్: విద్యా, సంస్కృతి, సాహిత్య రంగాలకు వరంగల్ పుట్టినిళ్లు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. వరంగల్లో పర్యటించిన ఎం వెంకయ్య నాయుడు ఎవివి కాలేజీ ప్లాటీనం జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాశ్చాత్య సంస్కృతి పెరిగి తెలుగు భాష ధ్వంసం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. భవష్యత్ తరాలకు విద్య అవసరమని, నైతిక విలువలతో కూడిన విద్యా కావాలన్నారు. కులం మతం పేరుతో వివాదాలు సరికాదని, నిర్భయ లాంటి సంఘటనలు సిగ్గు చేటని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు అని, కానీ విధ్వంసం సరికాదని, ఇండియన్ రక్తంలోనే సెక్యులరిజం ఉందని వెంకయ్య స్పష్టం చేశారు.
Secularism in Indian Blood says M Venkaiah Naidu
- Advertisement -