Saturday, May 4, 2024

నిషేధిత గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : అక్రమంగా కారులో తరలిస్తున్న 25 కిలోల నిషేధిత గంజాయిని మంగళవారం ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగాపట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అబ్కారి సిఐ రాజశేఖర్‌రావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కలసి బొజ్జాయిగూడెం సమ్మక్కసారలమ్మ గుడివద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానిత

రెనాల్ట్ ట్రైబర్ కారులో ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించామన్నారు. ఈ తనిఖీలో ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ సర్వేష్, ఎస్‌ఐ ముబ్‌షేర్, రాజశేఖర్‌రావు ఇల్లందు ఎక్సైజ్ సిఐ, ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News