- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ దగ్గరలోని ఛేరీ ఖేడి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఏడుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయ్ పూర్ లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశాలోని గంజామ్ కు చెందిన వలస కూలీలు గుజరాత్ లోని సూరత్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సీ అజయ్ జాదవ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -