Saturday, May 4, 2024

మోసం చేశాడని ప్రియుడిపై ప్రియురాలు దాడి

- Advertisement -
- Advertisement -

She attack on Lover in Human right Commission

హైదరాబాద్: ప్రేమించి శారీరకంగా వాడుకొని మరో యువతి పెళ్లి చేసుకున్న ప్రియుడిని యువతి కొట్టిన సంఘటన హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్ ప్రాంగణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణా జిల్లా వత్సవాయి మండలం శీను తండాకు చెందిన ఆశోక్ కుమార్ వనపర్తికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ప్రేమించుకోవడంతో గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని యువకుడిని నిలదీసింది. అతడు ఆమెకు మాయమాటలు చెప్పి అబార్షన్ చేయించాడు. సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం రావడంతో యువకుడి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో చేయడంతో ఆ కేసు హైకోర్డులో నడుస్తోంది. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో కేసు హైకోర్టులో ఉండడంతో వారేమీ చేయలేకపోయారు. తన హక్కులను కాపాడుతారని ఇక్కడ కూడా తన అన్యాయం జరిగిందని బాధితురాలు వాపోయింది. మానవ హక్కుల కమిషన్‌కు వచ్చిన ప్రియుడిపై ఆమె దాడి చేయడంతో అతడు తిరిగి దాడి చేశాడు. ఇద్దరిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News