Friday, May 3, 2024

అసదుద్దీన్ ఒవైసీపై కారుపై కాల్పులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఓవైసీ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై కారుపై కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు మూడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. 34 తూటాలు కారు కింది భాగంలోకి దూసుకెళ్లాయి. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయలుదేరాను. ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 34 రౌండ్ల బుల్లెట్స్ దూసుకెళ్లాయి. దాంతో నా వాహణం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగులు ఉన్నారు. నేను వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయాన’ని ఓ వార్తా సంస్థతో అసద్ చెప్పారు. ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం చేసేందుకు నలుగురు దుండగులు ఛజర్సీ టోల్‌ప్లాజా సమీపంకు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. కాల్పుల తర్వాత తుపాకులు ఘటనాస్థలంలో వదిలి దుండగులు పరారైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడికావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలనికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Shots Fired on Asaduddin Car in Meerut

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News