- Advertisement -
ఖమ్మం: జిల్లాలోని కారేపల్లి మండలం సింగరేణి సర్పంచ్ స్రవంతి శనివారం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కొద్దిరోజుల నుంచి సింగరేణి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోంది. రూ. 25 లక్షలు దుర్వినియోగం అయినట్టు అధికారులు నిర్ధారించారు. తాజాగా పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మరోసారి అధికారులు విచారణ చేేపట్టారు. దీంతో మనస్తాపం చెందిన సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Singareni Sarpanch Attempt suicide
- Advertisement -