Sunday, April 28, 2024

ఒఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six members dead in Bolero accident at ORR

 

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై బొలెరోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాటి గ్రామం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఢిల్లీ చెందిన ఏడుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో హైదరాబాద్ నుంచి పఠాన్ చెరు వైపుకు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనదారుల సమాచారం మేరకు స్థానిక సిఐ రామిరెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. మృతదేహాలను వాహనంలో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News