Sunday, May 5, 2024

సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్ సిటీలో పొగలు

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్‌లో ఆదివారం పొగలు వచ్చాయి. కాగా రైలు జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే పొగలు రావడాన్ని గమనించారు. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్ ఘన్‌పూర్‌లో 10 నిమిషాల పాటు రైలును నిలిపివేసి పూర్తిస్థాయిలో పరిశీలించారు. బ్రేక్ లైనటర్లలో పొగలు వచ్చాయని ఎలాంటి ప్రమాదం లేదని నిర్దారించిన అనంతరం రైలు యదావిధిగా గుంటూరుకు బయలుదేరింది. పొగలు రావడంతో ఇంటర్ సిటిలోని ప్రయాణికులు ఒకింత ఆందోళకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News