Sunday, April 28, 2024

తండ్రి బర్త్ డే…. కేక్ కోసం బయటకు వెళ్లిన కుమారుడు శవంగా మారి…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తండ్రి భర్త్ డే వేడుకలు ఘనంగా జరపాలని ఓ యువకుడు కేక్ కోసం బయటకు రావడంతో అతడిని పలుమార్లు గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి హత్య చేసిన సంఘటన ఢిల్లీలోని అంబేడ్కర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  19 ఏళ్ల కునాల్ అనే యువకుడు తన తండ్రికి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరపాలని భావించారు. కేక్ కోసం బయటకు వచ్చాడు. నలుగురు యువకులు అతడిని అడ్డగించి కడుపు, చాతీలో కత్తితో పొడిచారు. అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. చావు బతుకుల మధ్య ఉన్న కునాల్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువకుడు చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. కునాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. యువతి విషయంలో కునాల్, గౌరవ్ కొన్ని రోజుల నుంచి గొడవ పడుతున్నారు. దీంతో కునాల్ చంపాలని గౌరవ్ నిర్ణయం తీసుకున్నాడు. ప్లిప్ కార్ట్ లో రెండు కత్తులను కొనుగోలు చేసి మరో ముగ్గురుతో కలిసి కునాల్ ను గౌరవ్ హత్య చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News