Monday, April 29, 2024

గాయపడిన మహిళను 4 కిలో మీటర్లు మోసుకెళ్లి

- Advertisement -
- Advertisement -

ముంబయి: రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన మహిళను పోలీసులు నాలుగు కిలో మీటర్లు మోసుకెళ్లిన సంఘటన మహారాష్ట్రలోని ఖండలా-కార్జత్ మధ్య జరిగింది. పశ్చిమ కనుమల్లో రైల్వే ట్రాక్‌ను దాటుతుండగా మహిళను రైలు ఢీకొట్టింది. ఆమె తీవ్రంగా గాయపడడంతో రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మహిళను చూసి బాధపడ్డారు. ఘటనా స్థలానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పోలీసులు గాయపడిన మహిళను నాలుగు కిలో మీటర్లు మోసుకెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో పలాస్ దారిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News