Saturday, May 4, 2024

ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

South Central Railway reduced platform ticket prices

 

హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కోవిడ్ కారణంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్లాట్‌ఫాం టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే పెంచిన విషయం తెలిసిందే. తాజాగా పెంచిన ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 50 రూపాయలు ఉన్న ప్లాట్‌ఫాం టికెట్ ధరలను సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ లలో 20రూపాయలకు తగ్గించింది.  (నాన్‌ సబర్బన్, సబర్బన్)  మిగితా చిన్న స్టేషన్లలో 10రూపాయలకు తగ్గించింది. టికెట్స్ ను నేరుగా కౌంటర్ వద్ద, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News