Tuesday, April 30, 2024

యాదాద్రిలో శివుడికి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రిభువనగిరి : శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదాద్రి కొండపైన కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కావడంతో శివుడికి అభిషేక పూజలు, రుద్ర హోమ పూజలు శాస్రోక్తంగా పండితులు నిర్వహించగా భక్తులు, స్థానికులు పాల్గొని శివ దర్శనం చేసుకున్నారు. ఉపవాసాలతో ఉన్న భక్తులు శివ దర్శనం, ప్రత్యేక పూజలు చేసి తమ మెక్కుబడులను చెల్లించారు. ఉదయం శివాలయంలో అర్చకులు అభిషేక పూజలు, శివాలయంలో జరుగు నిత్యపూజలో భాగంగా ఆలయ ఆవరణలో రుద్రహోమ పూజలను అర్చకులు, పండితులు శాస్త్రానుసారం నిర్వహించగా, సాయంత్రం శివాలయ ఆవరణలో మేళతాళాల మద్య వేదమంత్రోచ్చరన గావిస్త్తూ శివుడిని ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు.

ఆలయ నిత్యపూజలో భక్తులు..
స్వామివారి దర్శించుకున్న భక్తులు శ్రీవారి క్షేత్రంలో జరిగిన అభిషేకం, అర్చన, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణం, వెండి జోడి సేవ, వత్రపూజలలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
స్వామివారి ఆలయ నిత్యరాబడిలో భాగంగా సోమవారం రూ.25,10,762 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.10,50,460, కొండపైకి వాహన అనుమతి ద్వారా రూ.3,00,000, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2, 89,000, వీఐపీ దర్శనం ద్వారా రూ.1,65,000 బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,48,100, వ్రతపూజల ద్వారా రూ.44,8 00తో పాటు పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News