Sunday, April 28, 2024

కులం చూసి కాదు… గుణం చూసి గెలిపించారు: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వక్ఫ్ భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాలు విసిరారు. వక్ఫ్ భూములు కబ్జా చేసినట్టు ఆరోపణలపై శ్రీనివాస్ గౌడ్ రీకౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ నాయకులపై ప్రతిపక్షాలకు అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజల ఓట్లు సంపాదించుకోలేరని, అధిక మెజార్టీతో గెలిచి కూడా తమపై దుష్ప్రచారం చేస్తన్నారని శ్రీనివాస్ దుయ్యబట్టారు. మమ్మల్ని కులం చూసి కాదని, గుణం చూసి గెలిపించారన్నారు.

Also Read: అట్టర్‌ప్లాప్ సినిమాను అద్భుతం అంటున్నారు: అంబటి రాంబాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News