Saturday, April 27, 2024

కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత సయ్యద్ ఇబ్రహీం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కెటిఆర్ , వి శ్రీనివాస్ గౌడ్‌ల సమక్షంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ మైనారిటీ నేత సయ్యద్ ఇబ్రహీం బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, వి. శ్రీనివాస్ గౌడ్‌ల సమక్షంలో ఆయన బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇబ్రహీంకు మంత్రి కెటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

ఈ సందర్భంగా తిరిగి సొంతగూటికి రావడం పట్ల ఇబ్రహీం సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఇదే ఒరవడి కొనసాగాలంటే భారీ మెజారిటీతో మరోసారి ఆయనను గెలిపించాలని ఇబ్రహీం అన్నారు. ప్రజలంతా సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టాలన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News