Sunday, May 5, 2024

వలసకూలీల అంశంపై సుప్రీం మధ్యంతర తీర్పు

- Advertisement -
- Advertisement -

Supreme Court order on migrant workers

న్యూఢిల్లీ: వలసకూలీల అంశంపై సుప్రీం కోర్టు మంగళవారం మధ్యంతర తీర్పు ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు 15 రోజుల్లో తరలించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్రాలు అడిగిన 24గంటల్లో శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయాలయని కేంద్రానికి సూచించింది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం లాక్ డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వలసదారులపై నమోదైన అన్ని కేసులు ఎత్తివేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ ధర్మాసనం జులై 8వతేదీకి వాయిదా వేసింది.

Supreme Court order on migrant workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News