- Advertisement -
భువనేశ్వర్: ఒడిశాలో 49 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వీరంతా కటక్ లోని ముండాలికి చెందిన ఎన్డీఆర్ఎస్ 3వ బెటాలియన్ సిబ్బందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఇటీవల వచ్చిన అంపన్ తుపాను సహాయక చర్యల్లో ఈ సిబ్బంది పాల్గొన్నారు. అంపన్ తుపాను సహాయక చర్యల కోసం 173 మంది సభ్యుల బృందం బెంగాల్ కు వెళ్లింది. జూన్ 3వ తేదీన బెంగాల్ నుంచి ఒడిశాకు సిబ్బంది తిరిగి వచ్చారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 49మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన వారిని క్వారంటైన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.
49 personnel of NDRF test Covid-19 +ve in Odisha
- Advertisement -