Wednesday, May 15, 2024

రాహుల్ గాంధీ పిటిషన్‌పై జులై 21న సుప్రీం విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోడీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై జులై 21న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు ఇటీవల కొట్టేసింది.

దీంతో ఈ తీర్పున సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటక లోని కోలార్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువు నష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షవిధిస్తూ ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంట్ సభ్యులు ఏదైనా కేసులోదోషిగా తేలి, కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది.

దీంతో ట్రయల్ కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల్లోనే రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. దీంతో సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో రాహుల్ గాంధీకి కింది కోర్టు శిక్ష విధించడం సరైనదేనని హైకోర్ట తెలిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ రాహుల్ పిటిషన్‌ను కొట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News