Saturday, April 27, 2024

సురభీ వాణీదేవి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది

- Advertisement -
- Advertisement -
surabhi vani devi will heavy majority win says talasani
మంత్రి శ్రీనివాస్‌యాదవ్

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురబి వాణీదేవి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులను ఆయన అభినందించారు. అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు టెలీకాన్ఫరెన్స్‌లు, వరస సమావేశాలు, నిర్వహించి మమ్మల్సి ప్రోత్సహించిన టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భాగంగా పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని విస్తృత ప్రచారం నిర్వహించిన జిహెచ్‌ఎంసి పరిధిలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లకు, పార్టీనాయకులకు,సానుభూతి పరులు, కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిసారిగా పట్టభద్రుల ఎన్నికల్లో ఇంతభారీగా పోలింగ్ జరగడం, ఓటర్లలో వచ్చిన చైతన్యానికి నిదర్మనమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News