Wednesday, May 1, 2024

తాడిపత్రిలో నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి తగలబెట్టారు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: వేసవి కాలంలో ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. సజ్జలదిన్నెలో నల్లపురెడ్డి, కృష్ణవేణి అనే దంపతులు నివసిస్తున్నారు. తన కూతురు పూజితతో కలిసి దంపతులు ఆరుబయట నిద్రస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటలు కూతురుకు అట్టుకోవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు మంటలను ఆర్పేసి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News