Friday, May 3, 2024

ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకున్న మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతబాద్ శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణనాధుడిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి 150 కిలోల లడ్డును సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహకులు మంత్రి తలసాని దంపతులను శాలువాతో సన్మానించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇంఛార్జీ తలసాని సాయి కిరణ్ యాదవ్, బెవరేజెస్ కార్పోరేషన్ ఛైర్మన్ గజ్జల నగేష్; బాక్సర్ రాంరెడ్డి తదితరులు వినాయకుడిని దర్శించుకున్నారు.

Talasani Srinivas Visit Khairatabad Ganesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News