Friday, May 3, 2024

మంకీపాక్స్ లక్షణాలుండే ప్రయాణికులను వేరుగా ఉంచనున్న తమిళనాడు!

- Advertisement -
- Advertisement -

Monkeypox

చెన్నై: మంకీపాక్స్ లక్షణాలున్న విదేశీ ప్రయాణికులను వేరుగా ఉంచాలని తమిళనాడు ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల డైరెక్టర్లకు లేఖ రాసింది. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం, మధురై, టుటికోరిన్‌లోని విమానాశ్రయాల డైరెక్టర్‌లకు రాసిన లేఖలో, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి లేదా అలసట వంటి లక్షణాలతో అంతర్జాతీయ గమ్యస్థానాల నుండి ల్యాండింగ్ చేసే ప్రయాణికులను తప్పనిసరిగా వేరుచేసి వారి నమూనాలను పరీక్ష కోసం సేకరించాలని కోరింది.

పిసిఆర్ పరీక్షల కోసం రాష్ట్ర ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా పుణెలోని ఐసిఎంఆర్-ఎన్‌ఐవి ల్యాబొరేటరీకి వెసికిల్స్, రక్తం , కఫంలోని ద్రవాలు వంటి ఈ నమూనాలను పంపనున్నట్లు ఆరోగ్య సేవల డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు.

ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఇంటికి చేరుకున్న తర్వాత వారి కోసం కఠినమైన ప్రోటోకాల్‌లను పాటించేలా చూడాలని ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఆరోగ్య డిప్యూటీ డైరెక్టర్‌లకు పిలుపునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News