- Advertisement -
అక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టి-20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కివీస్ పై ఏడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 132 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో రాహుల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ 32 బంతుల్లో 44 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (8), విరాట్ (11) పరుగులు చేసి నిరాశపరిచారు. కీవిస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా సోదీ ఒక వికెట్ తీశాడు. ఐదు టి-20 సిరీస్ లో టీమిండియా 2-0తో ముందంజలో ఉంది.
Team India won second Twenty in Ind vs NZ Match
- Advertisement -