Saturday, April 27, 2024

మణిపూర్‌లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక విమానం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకున్న తెలంగాణ పౌరులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక హెల్స్ లైన్ నంబర్, ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. మణిపూర్ రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంతో వాటిని అదుపు చేసేందుకు పోలీసులు కర్ఫూ అమలు చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు వెళ్లిన తెలంగాణ ప్రజలను సురక్షితంగా ఇక్కడికి తీసుకుని వచ్చేందుకు వేగంగా స్పందించింది. తెలంగాణ పౌరులు, విద్యార్థుల కోసం డిఐజి సుమతి ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని రాష్ర్ట డిజిపి అంజనీకుమార్ తెలిపారు. సాయం కోసం 7901643283 నంబర్‌లో గానీ, dgp@tspolice.gov.inలో సంప్రదించాలని కోరారు.

అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మణిపూర్ పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు చెందిన 250మంది విద్యార్థులు మణిపూర్ రాజధాని ఇంఫాల్ దాని పరిసర ప్రాంతాల్లో చదువుకుంటున్నారని తెలిపారు. వారిని విమానంలో తీసుకుని వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక విమానం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇంఫాల్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. విద్యార్థులను విమానంలో మణిపూర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకుని రానున్నట్లు తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకుని వచ్చేందుకు తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మణిపూర్ ఛీఫ్ సెక్రటరీతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 50మంది విద్యార్థులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News