Saturday, April 27, 2024

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం….

- Advertisement -
- Advertisement -

Telangana assembly meeting started

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటించి, విధిగా మాస్కు ధ‌రించాల‌ని శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సూచించారు.  మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే సభలోకి అనుమతించారు. ఒక్కో మంత్రి తరఫున ఒక పిఎ, పిఎస్ ను మాత్రమే అనుమతించారు. ప్రత్యేక యంత్రాల సహాయంతో అసెంబ్లీకి వచ్చే ఫైల్స్ ను శానిటైజ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News