- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ రాఘవేంద్రప్ప ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బోయ సురేష్(28), చాకలి కృష్ణ(30), సిద్ధనగౌడ(30)గా గుర్తించారు. గుండ్లపల్లి నుంచి కదరంపల్లి వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
- Advertisement -